గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన రాశీ ఖన్నా?
ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా చలామణి అయిన రాశీ ఖన్నాను వరుస ఫ్లాపులు నిరాశకు గురిచేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు డిజాస్టర్లవడంతో రాశీకి ఏడాది పాటూ టాలీవుడ్ నుంచి అవకాశాలే రాలేదు. ఆ టైమ్ లో బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టి పెట్టడంతో తెలుగు సినిమాలకు దూరమైంది రాశీ.
దీంతో రాశీ ఖన్నా తెలుగు సినిమాలకు దూరమైంది, ఇక్కడ ఆమె కెరీర్ ముగిసింది అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశీ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుంది. ఇప్పటికే నీరజ కోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా తెలుసు కదా సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. టిల్లు స్వ్కేర్ తర్వాత సిద్దు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఉంటుంది.
ఈ సినిమాతో రాశీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రాశీ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో రాశీ ఖన్నా ఛాన్స్ అందుకుందని టాక్. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు. తర్వాత ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఇప్పుడు రాశీ మరో ప్రత్యేక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు బాగా ఆడితే రాశీ మళ్లీ టాలీవుడ్ లో పాగా వేయడం ఖాయం.