నాగ్ తో జతకట్టనున్న క్రేజీ హీరోయిన్..
టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున సినిమాల విషయంలో ఈ మధ్య కాస్త స్లో అయ్యాడనే చెప్పాలి. సరైన హిట్స్ పడకపోవడంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ లో ఆచి తూచి అడుగు వేస్తున్నాడని తెలుస్తుంది. గత సంవత్సరం రిలీజైన ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. డిఫరెంట్ కథతో వచ్చినా ఎందుకో ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. ఈ దెబ్బతో నాగ్ తన తదుపరి సినిమాల్లో కథ ఎంపిక దగ్గర్నుండి అన్ని అంశాలపైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారని సమాచారం.
సాధారణంగా ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు ఇస్తుంటారు కింగ్ నాగార్జున. అదే విధంగా యంగ్ టాలెంటెడ్ రైటర్ కి తన నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన ధమాకా సినిమా రైటర్ ప్రసన్న కుమార్ నాగ్ అప్ కమింగ్ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నాగ్ సరసన జోడి కట్టనుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న నాగార్జున న్యూ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. 18 పేజెస్ సినిమాతో కుర్రకారు మనసుని దోచుకున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నాగార్జున ఈ స్పెషల్ పాత్ర కోసం రికమెండ్ చేసి మరి అనుపమని తీసుకున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. యంగ్ టాలెంటెడ్ మేకర్స్ తో నాగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అవుతుంది.