కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ షాక్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని చెప్పింది. వివిధ సర్వీసు నిబంధనల ప్రకారం గత మూడేండ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీ విరమణ చేశారని లోక్సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Tags :