ప్రధాని మోదీ మరో రికార్డు!
అమెరికాలో అధికార పర్యటన చేపట్టనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. అమెరికా చట్ట సభల్లో రెండు సార్లు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని మోదీని వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్కార్తీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్, సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్యానల్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తాను ఉత్సుకతతో ఉన్నానని, ఇది తనకు గర్వకారణమని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్కు గర్వకారణమని మోదీ తెలిపారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా భారత్, అమెరికా బంధం ఏర్పడిరదని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Tags :