శ్రీవారి ఆలయంలో వైభవంగా జ్వేష్ఠాభిషేకం
శ్రీవారి ఆలయంలో జ్వేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం రుత్వికులు శాంతి హోమం నిర్వహించారు. పూజల అనంతరం కంకణధారణ చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకాం సేవ అనంతరం ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
Tags :