తీహార్ కు కవిత.. షాక్ లో బీఆర్ఎస్..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని అనుమానంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈరోజు జరిగిన విచారణ నేపథ్యంలో కాసేపటి క్రితం వరకు ఆమె పిటీషన్ రిజర్వ్ లో ఉంచిన కోర్టు.. తీర్పును కవితకు వ్యతిరేకంగా వెల్లడించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఏప్రిల్ 9 వరకు కవిత రిమాండ్ లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో జ్యూడిషియల్ రిమాండ్ కోసం ఆమెను తీహారు జైలుకు తరలించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఒక్కసారి బీఆర్ఎస్ శ్రేణలు షాక్ కి లోనయ్యారు.మనీ లాండరింగ్ కేసు నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవిత అరెస్టు అయిన తొలి రోజుల్లో ఆమెకు వెల్కమ్ టు తిహార్ అంటూ రాసిన లెటర్ నిజం కాబోతుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.