దేశంలో మరోసారి కలకలం... ఒక్కరోజులోనే
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇటీవల కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. నేడు ఒక్కరోజే 40 శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ మనల్ని ఇంకా వెంటాడుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమీకాదని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకున్నారు. అందుకోసం తగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీని సహజంగా పెంచుకొనేందుకు రోజూమీరు తీసుకునే ఆహారంలో వీటిని యాడ్ చేసుకుంటే భలే బూస్ట్ అంటున్నారు.
Tags :