ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హైదరాబాద్ లో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధం

హైదరాబాద్ లో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధం

రాష్ట్ర రాజధానిలో మరో భారీ భూవేలానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మోకిల ఫేజ్‌-2లో ప్లాట్ల అమ్మకానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తంగా 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. 98,975 గజాల అమ్మకంతో రూ.800 కోట్లు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. లేఅవుట్‌లో 300 నుంచి 500 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వేలంలో పాల్గొనేందుకు ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ లో పేర్కొంది. రిజిస్ట్రేషన్‌తో పాటు రూ.లక్ష డిపాజిట్‌ చేయాలని తెలిపింది. చదరపు గజానికి రూ.25 వేలు కనీస ధరగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. మోకిల తొలి ఫేజ్‌ వేలంలో గరిష్టంగా గజానికి రూ.1.05 లక్షలు, కనిష్ఠంగా రూ.72 వేలు పలికిన సంగతి తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :