దేశీయ విపణిలోకి ఫోర్డ్ పునరాగమనం!
అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ తిరిగి మనదేశ విపణిలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈసారి విద్యుత్ వాహన (ఈవీ) విభాగంపై ఈ సంస్థ దృష్టి పెట్టనుంది. 2021లో భారత కార్యకలాపాల నుంచి ఫోర్డ్ వైదొలగిన సంగతి తెలిసిందే. పునరాగమనానికి, చెన్నైలోని తయారీ సదుపాయాలను వినియోగించుకోవాలని కంపెనీ అనుకుంటోంది. ఇందుకోసం సిబ్బందిని నియమించుకునే పనిలో ఉన్నట్లూ తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు పోటీనిచ్చే మధ్యస్థాయి ఎస్యూవీకి డిజైన్ పేటెంట్ల కోసం ఈ కంపెనీ దరఖాస్తు చేసిందని తెలిసింది. త్వరలో ఆవిష్కరించనున్న ఎండీవర్ ఎస్యూవీ కోసమే ఈ పేటెంట్ అని తెలిసింది. మరో వైపు భారత్లో మస్టాంగ్ మాక్`ఇ కోసం ట్రేడ్మార్క్ను ఫోర్డ్ సంపాదించింది.
Tags :