ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పుపై ఫరూఖ్ అబ్దుల్లా ఆగ్రహం
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా అందించిన ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూకశ్మీర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఈ విషయంపై మండిపడ్డారు. ‘జమ్మూకశ్మీర్ సర్వనాశనం అయిపోయినా ఎవరికీ పట్టదు. వాళ్లు ప్రజలను మోపసం చేశారు. మనసులు గెలుస్తామని చెప్పే వాళ్లు ఇలా ప్రజలను దూరంగా నెట్టేస్తే ఎలా?’ అని నిలదీశారు. అలాగే ఆర్టికల్ 370 విషయంలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయం తీసుకున్న సమయంలో నెహ్రూ అమెరికాలో ఉన్నారని, ఆయనపై బీజేపీ ఎందుకు ఇలా విషం చిమ్ముతుందో తెలియడం లేదని అన్నారు.
Tags :