మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు. తీర్పును రిజర్వ్ చేసిది. న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ మరోసారి విచారణ జరిపారు. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సిసోడియాకు బెయిల్ నిరాకరిస్తూనే స్వల్ప ఊరటనిచ్చింది. ఆయన భార్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఇంటికి లేదంటే ఆసుపత్రికి వెళ్లేందకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇల్లు, ఆసుపత్రి వద్దకు వెళ్లవచ్చని తెలిపింది. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో మినహా మరెవరితోనూ మాట్లాడకూడదని సూచించింది. మొబైల్ సైతం ఇవ్వరని, మీడియాకు దూరంగా ఉండాలని చెప్పింది. సిసోడియా తన భార్యను కలిసేందుకు వెళ్లే చోట మీడియా గుమిగూడకుండా చూడాలని ఢల్లీి పోలీసులను ఆదేశించింది.