రాహుల్ గాంధీకి ఊరట.. అమెరికా పర్యటనకు
మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కొత్త పాస్పోర్టు విషయంలో ఊరట లభించింది. సాధారణ పాస్పోర్టు కోసం నిరభ్యంతర పత్రం కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. మూడేళ్ల కాలానికి గాను ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రాహుల్ త్వరలోనే కొత్త పాస్పోర్టు పొందేందుకు వీలు లభించినట్లయింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఫలితంగా తన దౌత్య హోదా పాస్పోర్టు ను ఆయన అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా సాధారణ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Tags :