అఖిలేష్ యాదవ్ తో కేజ్రీవాల్ భేటీ
ఎస్పీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పోరాటానికి కలిసి రావాలని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ను కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ అధికారాలను నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించిన కేజ్రీవాల్ ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను కలిసి మద్దతు కోరారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో పాటు ఇతర అప్ నేతలు పాల్గొన్నారు.
Tags :