ప్రజా గాయకుడికి దాసరి వంశీ జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్కు దాసరి వంశీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫిలింనగర్లోని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హాల్లో ఈ మేరకు వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ఎక్కడో పల్లెటూర్లో పాటలు పాడుకునే తనను పిలిచి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఇదే వేదికపై దాసరి వంశీ ప్రతిభా పురస్కారాలు సైతం అందజేవారు. ఈ కార్యక్రమంలో వంశీ రామరాజు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ విరాట్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.
Tags :