అందుకే శరద్ పవార్ ప్రధాని కాలేదు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ గతంలో ప్రధాని కాకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర రాజస్థాన్కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే నడుస్తోంది. ప్రతిపక్షంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ ఆ పార్టీ వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదు. దీనివల్ల శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ వంటి అత్యంత సమర్థులకు ప్రధాని అయ్యే అవకాశం లభించలేదు అని అన్నారు.
Tags :