వారానికి మూడు రోజులు రావాల్సిందే.. కాగ్నిజెంట్
వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుండి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆదేశించింది. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు కంపెనీకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి టీమ్ లీడర్లు నిర్ణయిస్తారని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. ఇది ఎప్పటి అమల్లోకి వస్తుందో స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. ప్రాజెక్టులు, శిక్షణ, బృందాల వారీగా కలిసి పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్కు 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇందులో 2,54,00 మంది భారత్లో పనిచేస్తున్నారు.
Tags :