పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిచారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేటషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags :