రాజస్థాన్లో సస్పెన్స్కు తెర.. సీఎంగా భజన్ లాల్కు బీజేపీ ఓటు
ఎట్టకేలకు రాజస్థాన్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. జైపూర్లో సమావేశమైన కేంద్ర పర్యవేక్షకుల బృందం.. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్లాల్ శర్మను రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ అగ్రనేత వసుంధర రాజే ప్రకటించడం గమనార్హం. సంగానర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన భజన్లాల్.. 48 వేలకుపైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఆయనకు డిప్యూటీలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను బీజేపీ నియమించింది. డుడు నియోజకవర్గం నుంచి ప్రేమ్ చంద్ భారీ మెజార్టీతో గెలిచారు. రాజవంశానికి చెందిన దియా కుమారి కూడా విద్యాధర్ నగర్ నుంచి 71వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆమె పేరును కూడా సీఎం పదవి కోసం బీజేపీ పరిగణనలోకి తీసుకుంది. కానీ చివరకు భజన్లాల్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.
Tags :