ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా నుంచి భారత్ పై ఉగ్రచర్యలు

అమెరికా నుంచి భారత్ పై ఉగ్రచర్యలు

అమెరికా గడ్డను భారత్‌పై ఉగ్ర చర్యలకు అడ్డాగా ఉపయోగించుకొంటున్నారని సిలికాన్‌ వ్యాలీకి చెందిన భారతీయ ప్రముఖులు అమెరికా ఫోలీసులకు, న్యాయశాఖకు, నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సంస్థల ఉన్నతాధికారులతో కొన్ని రోజుల క్రితం వారు సమావేశమయ్యారు. క్యాలిఫోర్నియాలో హిందువులపై, జైనులపై విద్వేష చర్యలు పెరుగుతున్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు. పాఠశాలలు, భారతీయ కిరాణా దుకాణాల ముందు ఖలిస్థానీలు ట్రక్కులను నిలిపి ఉంచుతున్నారనీ, యువ భారతీయ అమెరికన్లను బెదరిస్తున్నారనీ తెలియజేశారు.

ఖలిస్థానీలు ఎయిరిండియా విమానాలను పేల్చివేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఖలిస్థానీ ఉద్యమం గురించి తమకు తెలియదనీ, ఈ విషయంలో అవగాహన పెంచాలని అమెరికన్‌ అధికారులు భారతీయ ప్రముఖులను కోరారు.  నిధుల కొరత, ఇతర బాధ్యతల వల్ల ఈ సమస్యపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామని వివరించారు. గడచిన నాలుగు నెలల్లోనే  బే ఏరియాలో 11 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని భారతీయ అమెరికన్లు పోలీసులకు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :