ఆదిత్య బిర్లా గ్రూప్ కీలక ప్రకటన
ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. రిటైల్ నగల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలిపింది. నావెల్ జెలెల్స్ పేరిట ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆదిత్యా బిర్లా గ్రూప్ ప్రకటించింది. సొంత నగల బ్రాండ్లతో కూడిన ప్రత్యేక రిటైల్ స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. వృద్ధికి అవకాశం ఉన్న కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడంలో భాగంగానే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు.
Tags :