ASBL NSL Infratech

దేవసేన కోసం...ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దేవసేన కోసం...ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌

అనుష్క ప్రధాన పాత్రధారిగా నిశ్శబ్దం చిత్రం రూపొందింది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కోన వెంకట్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రభాస్‌ రానున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్‌- అనుష్క మధ్య మంచి స్నేహం వుంది. ఇద్దరు కలిసి వరుస సినిమాల్లో నటించడం వలన ఆ స్నేహం మరింత బలపడింది. అందువల్లనే అనుష్క సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన విషయం కావడంతో ముఖ్య అతిథిగా రావడానికి ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వేడుకను ఏ తేదీన నిర్వహించినా.. ఎక్కడ జరిపినా తప్పకుండా వస్తానని ప్రభాస్‌ మాట ఇచ్చాడట. దాంతో ఈ సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :