తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త...
ఆర్టీసీ తిరుమల ప్యాకేజీ భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు వ్యయ ప్రయాసలకు లోనుకాకుండా ఉండేందుకు ఆర్టీసీలో సీటు, శ్రీవారి దర్శనం చేసుకునే వారికి తిరుపతి-తిరుమల టిక్కెట్ కూడా ఇవ్వనున్నారు. 10 శాతం రాయితీతో అందిస్తున్న తిరుపతి-తిరుమల టిక్కెట్ విధానం నేటి నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు రోజుకు వెయ్యి చొప్పున శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. వీరంతా తిరుపతి చేరుకున్న తర్వాత తిరుమల వెళ్లేందుకు పలు ఇబ్బందులు పడుతున్నట్లు యాజమాన్యం గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్, శ్రీవారి దర్శనం టిక్కెట్టుతో పాటు తిరుపతి`తిరుమల టిక్కెట్ కూడా జారీ చేస్తారు.
తిరుపతి చేసుకున్న తర్వాత అదే టిక్కెట్తో ఏడుకొండలు, అలిపిరి బాలాజీ బస్లాండ్ నుంచి తిరుమల వెళ్లే బస్సులు ఎక్కొచ్చు. ఇదే క్రమంలో తిరుపతి చేరుకునేందుకు తిరమల రాంభగీచ, బాలాజీ బస్లాండ్ నుంచి తిరుపతి వెళ్లే బస్సులు ఏక్కే ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు బ్రహ్మానంద రెడ్డి తెలిపరాఉ. ఈ టిక్కెట్ తీసుకోవడం వలన తిరుమలకు రాకపోకలు సాగించేదుకు క్యూ మర్గాల్లో వేచి ఉండకుండా సమయం ఆదా చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత ఈ టిక్కెట్లు 72 గంటల పాటు అమలులో ఉంటుందని తెలిపారు.