బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి షాక్

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్శాఖ ఏఈ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సంస్థ చైర్మన్గా ఉన్న రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.