భవిష్యత్లో చర్యకు ప్రతిచర్య తప్పదు : కేటీఆర్

తమ సహనాన్ని పరీక్షిస్తే, చర్యకు ప్రతిచర్య తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి చెప్పారు. కాంగ్రెస్ నేతలు చారాణా కూడా రుణమాఫీ కూడా చేయలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. భవిష్యత్లో చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని అన్నారు.