ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే అయిదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.