ReNew: విశాఖలో ఎపి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రెన్యూ పవర్
భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత
మంత్రి లోకేష్ ప్రకటించినట్లు ఇంథన రంగంలో రెన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి
• రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్న రెన్యూ పవర్ సంస్థ.
• ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలు కుదుర్చుకున్న రెన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు.
• ఇవి కాకుండా…గతంలోనే రూ. 22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన రెన్యూ పవర్.
• పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న రెన్యూ పవర్ సంస్థ.
• ఒప్పందంలో భాగంగా 6 GW PV ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న రెన్యూ పవర్
• తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధికి అవకాశం.
• ఇప్పటికే దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రెన్యూ పవర్ అంగీకారం.
• గత ప్రభుత్వంలో రాష్ట్రం వీడి వెళ్లిన కంపెనీలు తిరిగి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నాయని నిన్ననే ట్వీట్ చేసిన మంత్రి లోకేష్.
• లోకేష్ ట్వీట్ చేసిన ప్రకటనపై విశాఖలో నేడు సిఐఐ సమ్మిట్ కు ముందు కుదిరిన ఒప్పందం






