ఇసుజు ‘మూవర్’ ఎగుమతి వాహనం ప్రారంభం
– లాంఛనంగా ప్రారంభించిన విజయవాడ కస్టమ్స్ అదనపు కమిషనర్
శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్లాంట్లో తయారైన మొదటి ‘మూవర్’ (ఎం.ఓ.ఓ.డబ్ల్యూ.ఆర్) పథకం క్రింద తయారైన ఎగుమతి వాహనాన్ని మంగళవారం విడుదల చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇసుజు మోటార్స్ ఇండియా (ఐఎంఐ) మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మిట్టల్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కిషిమోటో సమక్షంలో కేంద్ర కస్టమ్స్ అదనపు కమిషనర్ సాధు నరసింహారెడ్డి జెండా ఊపారు. ఇదే కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఎగుమతి వాహనాలు తయారయ్యే ‘మూవర్’ గోదామును లాంఛనంగా ఆవిష్కరించారు. ఇసుజు కు శుభాకాంక్షలు తెలిపిన నరసింహారెడ్డి, మరో మైలురాయిని అధిగమించినందుకు ఇసుజు బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
మూవర్ పథకం గురించి వివరిస్తూ, తయారీ సంస్థల ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తొలగిస్తూ భారత ప్రభుత్వ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) శాఖ ఈ పథకాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. తయారీ రంగంలో పోటీని అధిగమించడం, ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశాన్ని మార్చడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు.
ఇసుజు బృందాన్ని అభినందించిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇసుజు ఇండియా పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐఎంఐ తన మొట్టమొదటి కార్ల తయారీ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, 2016లో ప్లాంట్ స్థాపన మొదలై పలు మైలు రాళ్ళును అధిగమించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా స్థానికులకు 80 శాతం ఉపాధి కల్పించడం, ఉద్యోగ కల్పన ద్వారా ఈ ప్రాంత సామాజిక ఆర్థిక వృద్ధికి చూపుతున్న చొరవను ఆయన అభినందించారు. ఎగుమతులు నిర్వహించే ఇసుజు మోటార్స్ ఇండియా (IMI) వంటి భారీ పరిశ్రమలకు ‘మూవర్’ పథకం వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాజేష్ మిట్టల్ చెప్పారు. పథకం అమలు దశలో అద్భుత మద్దతు, ప్రోత్సాహం అందించిన నరసింహారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్లాంట్ ఆవరణలో స్టోరేజ్ ప్రాంతంతో పాటు ‘మూవర్’ గిడ్డంగిని కలిగి ఉన్న భారీ పరిశ్రమలలో ఐఎంఐ ఒకటి అని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అతి తక్కువ వ్యవధిలో ‘మూవర్’ కార్యకలాపాలకు అనుమతి దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, శ్రీసిటీ యాజమాన్యం సహకారం, చొరవ ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా ఐఎంఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కిషిమోటో మాట్లాడుతూ, తమ సంస్థ ఎదుగుదలకు అద్భుత సహకారం అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎంఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కిషిమోటో మాట్లాడుతూ, తమ సంస్థ ఎదుగుదలకు అద్భుత సహకారం అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ‘మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ ఆపరేషన్స్ ఇన్ వేర్హౌస్ రెగ్యులేషన్’ ((Manufacturing & Other Operations In Warehouse Regulation-MOOWR -మూవర్) పథకంలో వస్తు దిగుమతి సమయంలో కస్టమ్స్ సుంకం చెల్లించకుండా దిగుమతి చేసుకునేందుకు భారతీయ తయారీదారులకు వీలు కలుగుతుంది. తయారీదారు సుంకం చెల్లించకుండా దిగుమతి చేసుకున్న వస్తువులను కోసం ప్రత్యేక గోదాముతో పాటు కస్టమ్స్ నిబంధనలను విధిగా అనుసరించాలి.
కాగా, జపాన్ కు చెందిన ఇసుజు మోటార్స్ ఇండియా దాని తయారీ యూనిట్ ను ఏప్రిల్ 2016లో శ్రీ సిటీలో ప్రారంభించింది. 50 వేల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 1500 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొదటి లైఫ్స్టైల్ మరియు అడ్వెంచర్ పికప్ వాహనం ISUZU D-MAX V-Cross, వ్యక్తిగత వాహన విభాగంలో ప్రీమియం 7-సీటర్ SUV వాహనం ISUZU mu-X, రెగ్యులర్ క్యాబ్, వాణిజ్య విభాగం కోసం ISUZU D-MAX తయారు చేస్తుంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1500 కాగా, అందులో 18% మహిళా శ్రామిక శక్తి. ఉద్యోగుల సంఖ్యలో 80% మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారే.






