విజయవాడ – ఢిల్లీ మరింత ఈజీ !

దేశ రాజధాని నుంచి ఏపీ రాష్ట్ర రాజధానికి మధ్య అనుసంధానం మరింత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతి రోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రతినిత్యం ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు సాగించనుంది.
విజయవాడ – ఢిల్లీ మధ్య ఇండిగో సంస్థ రోజు విమాన సర్వీసులను ప్రారంభిస్తుందనే ప్రకటన చేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ – ఢిల్లీకి రాకపోకలు ప్రారంభించనున్నారు. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ-అమరావతి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇది సాధ్యం చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని వెల్లడించారు. విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరు సమయం ఉదయం 11.10 గంటలకు కాగా.. ఢిల్లీకి మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకోనుంది. ఇక ఢిల్లీ నుంచి విజయవాడకు రాత్రి 08.10 గంటలకు బయలు దేరి విజయవాడకు రాత్రి 10.40 గంటలకు చేరుకోనుంది.