తానా మహాసభల సావనీర్ ఆవిష్కరణ
తానా 21వ మహాసభలను పురస్కరించుకుని కేసి చేకూరి సంపాదకీయంలో వెలువరించిన తెలుగు పలుకు సావనీర్ను మహాసభల వేదికపై ఆవిష్కరించారు. అమ్మ భాషకు పట్టం కడుతూ, మనకోసం ప్రవాసంలో పుట్టి పెరుగుతున్న మన బిడ్డలకోసం తెలుగును కాపాడుకోవాలన్న ఆకాంక్షతో తానా ఈ సంచికను అపురూపంగా తయారు చేసి ఆవిష్కరించింది. 40 వసంతాలు నిండిన తానా సంస్థ వైభవాన్ని, ఎల్లలు లేని తెలుగు ఆనవాళ్ళని, ప్రాభవాన్ని చాటి చెప్పడంతోపాటు తెలుగు ప్రజల జీవనశైలి, భాషా సాహిత్యాలు, సంస్కృతీ సంప్రదాయాలను ఇందులో వివరించారు.
Tags :