తమిళనాడు గవర్నర్ ను కలిసిన చినజీయర్ స్వామి
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవిని చినజీయర్ స్వామి కలిశారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆ సందర్భంగా గవర్నర్కు ఆహ్వానపత్రాన్ని అందించారు. శంషాబాద్ ముచ్చింతల్లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ధి (1000వ జయంతి) ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 14న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు.
Tags :