ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆకట్టుకోనున్న 'ఆటా తెలంగాణం'

ఆకట్టుకోనున్న 'ఆటా తెలంగాణం'

హ్యూస్టన్‌లో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జరిగే అమెరికా తెలంగాణ మహాసభల్లో హైలైట్‌గా ఆటా తెలంగాణం పేరుతో ప్రత్యేక సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. నాన్‌స్టాప్‌గా జానపద గానంతో గాయనీ గాయకులు అందరినీ ఆకట్టుకోనున్నారు. రసమయి బాలకిషన్‌ బృందం తమ పాటలతో హోరెత్తించనున్నది. చిన్‌ రఘు, సాయిచంద్‌ ట్రూప్‌, వీదా రజిని, శివనాగులు, బందం?సాయన్న, అనూష, లావణ్య, పెరుమాండ్ల బాబు, స్పరజన్‌ రాజు, బుష్‌పాగ, కార్తీక్‌ కొడకండ్ల, జనార్థన్‌ పన్నెల, పద్మావతి మామిండ్ల, నవీన్‌ సాంబరి, వజీదుస్తాన్‌ షేక్‌, మధుప్రియ తదితరులు ఈ కార్యక్రమంలో జానపద పాటలను పాడనున్నారు.

మహాసభల్లో పాటల విందు

హ్యూస్టన్‌లో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జరిగే ఆటా తెలంగాణ మహాసభల్లో తమ పాటలతో హోరెత్తించేందుకు పలువురు కళాకారులు హ్యూస్టన్‌కు తరలి వస్తున్నారు. గాయనీ గాయకులు మధు ప్రియ, పార్థసారధి నేమాని, రాము, కార్తీక్‌, సాయి చందు, వందేమాతరం శ్రీనివాస్‌, గోరెటి వెంకన్న తదితరులు ఈ వేడుకల్లో తమ పాటలతో అందరినీ ఆకట్టుకోనున్నారు.

 

Tags :