చినజీయర్ స్వామి కేసిఆర్ చర్చలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని జీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చి జీయర్ స్వామితో సమావేశమయ్యారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు, మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేసిన ముహూర్తం, దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై జీయర్ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు. ఫిబ్రవరిలో జీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈసందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి క్కడ చేసిన ఏర్పాట్లపై చినజీయర్ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.