ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సిలో ఘనంగా కనకదుర్గ కుంకుమార్చనలు

న్యూజెర్సిలో ఘనంగా కనకదుర్గ కుంకుమార్చనలు

న్యూజెర్సిలోని శ్రీ స్వామినారాయణ్‌ టెంపుల్‌లో  మే 6వ తేదీన జరిగిన విజయవాడ కనకదుర్గ కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. మే 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 'తెలుగు టైమ్స్‌', 'పాఠశాల', ధనలక్ష్మీ ట్రస్ట్‌ న్యూజెర్సిలో ఈ పూజలను మే 6,7 తేదీల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కంప్యూగ్రా అధినేత రామ్‌ మోహన్‌ వేదాంతం ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడి పూజలకు అవసరమైన ఏర్పాట్లను చేసింది. మరోవైపు భానుప్రసాద్‌ దివాకర్ల టీమ్‌ కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కృషి చేసింది. విజయవాడ నుంచి వచ్చిన అమ్మవారి అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్ర కుంకుమార్చన చేయించారు. పూజల్లో పాల్గొనడానికి వచ్చిన భక్తులు విజయవాడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని చూసి పులకించిపోయారు.

ఈ పూజల్లో రామ్‌ వేదాంతం దంపతులతోపాటు తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంటసుబ్బారావు దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ కుంకుమార్చనలకోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు, పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery

 

Tags :