ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డాలస్ లో విజయవాడ కనక దుర్గ అమ్మవారి కుంకుమార్చనలు

డాలస్ లో విజయవాడ కనక దుర్గ అమ్మవారి కుంకుమార్చనలు

అమెరికాలోని వివిధ నగరాల్లో జరుగుతున్న విజయవాడ కనకదుర్గ కుంకుమార్చనల పూజల్లో భాగంగా మే 22వ తేదీన టెక్సాస్‌లోని డాలస్‌ - ఫ్రిస్కోలో జరిగిన కుంకుమార్చన పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయవాడ నుంచి వచ్చిన ఆలయ బృందం భక్తుల చేత శాస్త్రోక్తంగా కుంకుమార్చనల పూజలు చేయించింది. త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పూజలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఫ్రిస్కోలోని ఎంబసీ సూట్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు భక్తులు తరలివచ్చి ఆదిపరాశక్తిని దర్శించుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు, పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు ఈ కుంకుమార్చనలను భక్తిపారవశ్యంగా జరిగేలా చేశారు. పూజల్లో పాల్గొన్న దంపతులకు అమ్మవారి కుంకుమ ప్రసాదంతోపాటు శేషవస్త్రాలను, డాలర్‌ను బహూకరించారు. ఈ పూజలకోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకువచ్చిన శ్రీచక్రార్చన పీఠం అందరినీ విశేషంగా ఆకర్షించింది. శేషారావు బొడ్డు, రవి మద్ది, సురేంద్ర ధూళిపాళ్ళ, లక్ష్మీ కాంభోజి, రవి కావూరి, సుబ్బారావు పొన్నూరు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. రామ్‌ తాతినేని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

 

Tags :