ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాషింగ్టన్ లో ఘనంగా కుంకుమ పూజలు

వాషింగ్టన్ లో ఘనంగా కుంకుమ పూజలు

అమెరికాలో వివిధ నగరాల్లో జరుగుతున్న విజయవాడ కనకదుర్గ కుంకుమార్చనల పూజల్లో భాగంగా మే 8వ తేదీన వాషింగ్టన్‌ డీసిలోని లెపోర్ట్‌ స్కూల్‌లో జరిగిన కుంకుమార్చన పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయవాడ నుంచి వచ్చిన ఆలయ బృందం భక్తుల చేత శాస్త్రోక్తంగా కుంకుమార్చనల పూజలు చేయించింది. త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పూజలను ఈ సందర్భంగా నిర్వహించారు. విజయవాడ నుంచి వచ్చిన లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు, పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు ఈ కుంకుమార్చనలను భక్తిపారవశ్యంగా జరిగేలా చేశారు. పూజల్లో పాల్గొన్న దంపతులకు అమ్మవారి కుంకుమ ప్రసాదంతోపాటు శేషవస్త్రాలను, డాలర్‌ను బహూకరించారు. ఈ పూజలకోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకువచ్చిన శ్రీచక్రార్చన పీఠం, దేవీ ప్రతిమను భక్తులు దర్శించుకున్నారు. వాడ్రేవ్‌ పేర్రాజు ఈ పూజలు ఘనంగా జరగడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని తెలుగువాళ్ళతోపాటు ఇతర ఎన్నారై భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :