ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని చెప్పారు.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్లో ఏపీ దూసుకుపోతోందని చెప్పారు.

 

 

Tags :