డిసెంబర్లో ‘హెల్త్ సిటీ’ పనులు ప్రారంభం
అమరావతిలో నెలకొల్పే ‘హెల్త్ సిటీ’ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెడతామని ‘ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్’(IUIH)కు చెందిన అజయ్ రాజన్ గుప్తా ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి సమావేశం జరిపిన రాజన్ గుప్తా ‘హెల్త్ సిటీ’ ప్రాజెక్టు నిర్మాణం పనుల బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీకి అప్పగించినట్టు వెల్లడించారు. 2018 అక్టోబరు కల్లా భవంతుల నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభిస్తామని మాటిచ్చారు.
Tags :