ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చిన జీయర్ స్వామి ను కలిసిన సీఎం కేసీఆర్

చిన జీయర్ స్వామి ను కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముచ్చింతల్‌లోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశ్రమ రుత్వికులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ చిన జీయర్‌ స్వామి సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ పునప్రారంభం ఏర్పాట్లపై వారు చర్చించారు. మహా సుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ (మార్చి 28), తదితర క్రతువులు, ఆహ్వానాలు, ఏర్పాట్లపై చిన జీయర్‌ స్వామి సలహాలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్నారు. ఆశ్రమ సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి ఇక్కడి యాగశాలను కూడా పరిశీలించారు. యాగశాల ఏర్పాట్లపై కేసీఆర్‌కు చిన జీయర్‌ స్వామి వివరాలు తెలిపారు.  ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మై హోమ్‌ అథినేత రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 

Tags :