ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రొఫెసర్ సాంబరెడ్డికి ​తెలంగాణ​ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం

ప్రొఫెసర్ సాంబరెడ్డికి ​తెలంగాణ​ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం

 ​-- ప్రపంచ తెలంగాణ మహాసభలో సత్కారం ​ ​

​అమెరికా ​​తెలంగాణ ​సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభలలో​​,​​ ​​​​ప్రొఫెసర్ ​దూదిపాల ​సాంబ రెడ్డి ​కి ప్రతిష్ఠాత్మక "తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం" ప్రధానం చేశారు. అమెరికాలో హౌస్టన్ మహానగరం లో జూన్ ​29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగ​న ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభల​లో ​​ప్రత్యేక బ్యాంకువేట్ అవార్డు సభలో, ​​టెక్సాస్ ఏ&ఎమ్ విశ్వవిధ్యాలయం ప్రొఫెసర్ డా. సాంబ రెడ్డి ని '​తెలంగాణ మహాసభల' బృందం​ ​తెలుగు సంప్రదాయాలతో ఘనంగా సత్కరిం​చారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో నిస్వార్ధంగా, అత్యంత ప్రతిభతో గత 20 సంవత్సరాలుగా ​ప్రొఫెసర్​ ​సాంబరెడ్డి చేసిన పరిశోధనలకు మరియు సేవ నిరతకు గుర్తింపుగా ఈ విశిష్ట పురష్కారాన్ని ఇస్తున్నట్లు మహాసభల నాయకత్వ బృందం ప్రకటించింది. ఇట్టి విషయాన్ని పాల పిట్ట అనే సావెనీర్ లో కూడా విడుదల చేశారు. వేల మందితో కిక్కిరిసిన ఈ మహాసభలకు అమెరికా అన్ని రాష్ట్రాలనుండి తెలుగు మరియు తెలంగాణ ప్రవాసులు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, MP సీతారాం నాయక్ తో పాటు ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాల మంది ప్రముఖులు పాల్గొన్నారు.

తెలంగాణ మహాసభల ఎగ్జిక్యూటివ్ మరియు కన్వెన్షన్ బృంద​ నేతృత్వములో అత్యంత వైభవంగా, ​మాతృ సంస్కృతిని మరిచిపోలేని విధంగా జరిగిన, ​ప్రారంభ డిన్నర్ వేడుక సభలో చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన గౌరవ తెలంగాణ ​​పార్లమెంట్ లీడర్ MP జితేందర్ రెడ్డి గారు ఈ సత్కారాన్ని​ ​డా. సాంబ రెడ్డి కి అందజే​సి ​పుష్పగుచ్ఛముతో గౌరవించారు. ప్రవాస తెలుగు ప్రము​ఖులు డా. సాంబరెడ్డిని అభినందించారు.  

అమెరికా తెలంగాణ మహాసభల ​ఆర్గనైజర్లు ​కరుణాకర్ మాధవారపు (చైర్మన్), ​సత్యనారాయణ రెడ్డి కం​​దిమల్ల (ప్రెసిడెంట్)​, ​శ్రీధర్ కాంచనకుంట్ల​ (డైరెక్టర్)​, ​​వినోద్ కుకునూర్​ ​(ప్రెసిడెంట్-ఎలెక్ట్)​,​ ​బంగారెడ్డి ఆలూరి ​(కన్వీనర్), ​​జగపతి రెడ్డి వీరటి​ (కోఆర్డినేటర్)​, ​డా. రాజేందర్ అపారసు (అవార్డు చైర్), బోర్డు మెంబర్లు, కన్వెన్షన్ సభ్యలు, కన్వెన్షన్ కమిటి చైర్మన్లు​, ​​తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హౌస్టన్​, తెలుగు కల్చరల్ అసోసియేషన్ హౌస్టన్ ​​సభ్యులు మరియు తదితరులు ఈ అవార్డు ​సభలో ​హాజరయ్యారు.

​వరంగల్ జిల్లా పరకాల ​మండల ​పరిధిలో​ని ఒక ​చిన్న గ్రామం చెర్లపల్లి లో ​ఒక పేద రైతు కుటుంబంలో ​జన్మించి, ​​ప్రతి రోజు కాలి నడకతో స్కూల్ కి వెళ్లి, స్వయం శక్తితో ​విద్యాబ్యాసం చేసిన ​డా. సాంబ రెడ్డి, కాకతీయ ​​విశ్వవిద్యాలయ​ ​ఫార్మసీ ​లో ఆరు బంగారు పతకాలతో ​పట్ట​ భద్రులయ్యారు. అటు తరువాత స్వతంత్ర బాటలో పంజాబ్ ​విశ్వవిద్యాలయ​ ​ఫార్మసీ ​లో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లిమ్కా రికార్డు సృష్టించారు. అయన వ్యాసాలు ఎంతో ప్రశస్తాన్ని పొందాయి. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మస్యూటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికంచాయి. ​​​​​​

డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ&ఎమ్ విశ్వవిధ్యాలయం వైధ్య శాస్త్ర ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు.​ అమెరికాలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన శాస్త్ర సంస్థ లయిన AAAS (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), AAPS (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), AES (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన అయిన ఇంటెర్నేలీషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు.

అయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బుల సైన్స్ అధ్యాయనంలో ప్రతి రోజు కష్ట పడుతున్నాడు. ఫీట్స్ వ్యాధికి ఒక మెడిసిన్ కనిపెట్టాడు. మెదడులోని ఉత్ప్రేరకాలు నది వ్యవస్థ సరఫరా విధానం లో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్ములనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించాడు. మెదడు దెబ్బల నుచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్ని ఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగ పడుచున్నవి. ​

​డా. సాంబ రెడ్డి ఒక  ​సామాజిక స్పృహ కల్గిన నాయకుడిగా డబ్బు సంపాదనే ద్వేయంగా కాకుండా, మెడికల్ శాస్త్ర సాంకేతిక ​రంగంలో తాను పొందిన జ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విధంగా, మెదడు రోగ నాడి చికిస్త్ర విధానాలకు ఒక కొత్త నంది పలికి - ఫైట్స్, తల దెబ్బలు, న్యూరోటాక్సిసిటీ, ఇతర మెదడు జబ్బులకు కొత్త మందులు కానీ పెట్టి న్యూరోలాజికల్ రోగులకు సృజనాత్మక చికిత్స లందిచి వారి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే తన జీవిత ద్వేయంగా మలచుకున్నారు.

మరో విశేషం ఏమంటే, 2012, 2013, 2014 లో వరుసగా అమెరికాలోని ప్రముఖ తెలుగు అసోసియేషన్స్ 'నాటా', 'తానా,' మరియు 'ఆటా' సంస్థల నుచి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించి, హ్యాట్రిక్ సృష్టించిన ఏకైక తెలుగు ప్రవాస భారతీయుడు. శాస్త్రవేత్తగా ల్యాబ్ లో బాగా బిజీగా వుంటునే, అమెరికన్ చారిటబుల్ సంస్థల ద్వారా అయన మెడికల్ క్యాంపులు, జనరల్ స్క్రీనింగ్, వాక్సినేషన్, వ్యాధి నిరోధక ఆహారం, వ్యాయామం, లాఫింగ్ యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నేను సైతం అంటు మానవీయ విలువలు కల్గిన ఒక కర్మ యోగిలా, ప్రమాదాలు సంభవించిన విద్యార్థులకు, అమెరికాలో ఆక్సిడెంట్ డెత్ జరిగిన చాలా కుటుంబాలకు చాల సార్లు సేవ చేసారు.

​డా. సాంబ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘనమైన 'తెలంగాణ ​​సైన్స్ పు​​రష్కారాం' ఇంతచిన్న వయసులోనే అందుకోవడం ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను. మీలో ఒకడిగా ఒక తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవవం నాకు ఇవ్వడానికి సహకరించిన సువిశాల నాయకులకి అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారానికి ఇంకా ఎంతో వన్నె తెచ్చి, రానున్న కాలంలో మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డ కి మనభారతీలందరి కీర్తి ప్రతిష్టలు పెంపొందించి మన కుటుంబాలకు ముఖ్యంగా మన పిల్లలకు మార్గదర్శిగా వుంటూ, సామజిక సేవ చెయ్యడమే నా ఆశయం అని అత్యంత కృతజ్ఞత భావంతో పేర్కొన్నారు.

తనకు జన్మనిచ్చి, తమ స్తోమతలో చదువు చెప్పించి, శాస్త్రవేత్తగా ఎదగడానికి ​పునాది వేసి, సోవిశాల జ్ఞానా సరస్వతికి నన్ను అత్యంత ప్రీతీ పాత్రం చేసి స్వర్గస్తులయిన మా "అమ్మ - నాన్న" లకు పాదాభివందనం చేస్తూ, ఈ అవార్డును నా మాతృ మూర్తుల జ్ఞాపకంగా వారికీ అంకితం చేస్తున్నాను. ​​

ఫార్మసీ ఫార్మకాలజీ రంగాల్లో అత్యంత ప్రతిభతో మెదడు జబ్బుల మందులను కనిపెట్టిన తెలుగుతేజం, హిందూ-రతన్ గ్రహీత డా. సాంబ రెడ్డి జీవిత చరిత్రని ప్రతిష్ట్మాక భారత శాస్త్రవేత్తల చరిత్ర జాబితాలో ప్రచురించారు. ​ ఒక కుగ్రామం నుంచి అమెరికాలో టాప్ ప్రొఫెసర్ గా ఎదిగి, వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటుతు, తెలుగు వారందరికి కీర్తి తెస్తున్న డా. సాంబ రెడ్డి ​'జీవిత పు​​రష్కారాం' & 'పద్మశ్రీ' లాంటి పురస్కారానికి అత్యంత అర్హత కలిగిని భారత శాస్త్రవేత్త అని పలువురు పేర్కొన్నారు.

Tags :