Modi: వికసిత భారతం.. నీతి ఆయోగ్ సదస్సులో మోడీ పిలుపు…

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Narendra Modi) అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ప్రధానంగా..వికసిత భారతమే అజెండాగా కొనసాగింది. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్@2047′ అనే అంశంపై సీఎంలకు ప్రధాని మోడీ దిశా నిర్దేశం చేశారు. మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. సదరు పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చేయాలని మోడీ సూచించారు. కేంద్ర రాష్ట్రాలు కలిసి చేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదని నొక్కి చెప్పారు.శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
“మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి టీం ఇండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదు” అని నీతి ఆయోగ్ (Niti Aayog) 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మోడీ అన్నారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రతి భారతీయ పౌరుడి లక్ష్యమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ప్రతి రాష్ట్రం వికసిత్ అయినప్పుడు, భారతదేశం వికసిత్ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష” అని మోడీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రమాణాల ప్రకారం తమ రాష్ట్రంలో కనీసం ఒక టూరిజం డెస్టినేషన్ (పర్యాటక గమ్యస్థానం) అభివృద్ధి చేయాలని మోడీ సూచించారు. “రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాలకు సమానంగా, అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేయాలి. ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం కావాలి. ఇది పొరుగున ఉన్న నగరాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి కూడా దారితీస్తుంది” అని మోడీ అన్నారు.
‘దిల్ సే రిష్ట బనాయా’ అని చెప్పిన ప్రధాని.. ఈశాన్య భారతం ఇప్పుడు భారతదేశ వృద్ధిలో ముందంజలో ఉందన్నారు. మహిళలను శ్రామిక శక్తిలో మరింతగా చేర్చాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. “వారు శ్రామిక శక్తిలో గౌరవంగా కలిసిపోయేలా మనం చట్టాలు, విధానాలను రూపొందించాలి” అని ఆయన అన్నారు.