త్వరలో రూ.100 కాయిన్ విడుదల
త్వరలో కేంద్రం రూ.100 కాయిన్ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ మన్కీ బాత్ 100 ఎసిపోడ్ సందర్భంగా రూ.100 కాయిన్ను విడుదల చేయనుంది. అయితే ఈ కాయిన్ కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుందని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం ప్రస్తుతం ఉన్న 1, 2, 5, 10, 20 నాణెల కంటే భిన్నంగా రూ.100 కాయిన్ ఉండనుంది. 44ఎంఎం డయా మీటర్లో గుండ్రంగా ఉండనుంది. ఈ కాయిన్ తయారీకి 35 గ్రాముల కాయిన్ లో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, జింక్ 5 శాతం కలిగి ఉంటుంది. కాయిన్పై అశోక స్తంభం ముద్ర, సత్యమేవ జయతే, దేవనాగరి భాషలో భారత్ అనేపదాలు ఉండనున్నాయి. నాణెం వెనుకభాగంలో మన్కీబాత్ 100 ఎసిపోడ్ లోగో, 2023 అని రాసి ఉంటుంది.






