దేశంలోనే తొలిసారిగా.. జలాంతర్భాగంలో
దేశంలోనే తొలిసారిగా అన్నట్టుగా జలాంతర్భాగంలో మెట్రో రైలును నడిపేందుకు కోల్కతా మెట్రో రైల్ కార్పోరేషన్ (కేఎంఆర్సీ) సన్నాహాలు చేస్తున్నది. హుగ్లీ నదిలో సొరంగ మార్గం ద్వారా నదికి పశ్చిమ ఒడ్డున హౌరా స్టేషన్ కాంపెక్ల్స్ను జలాంతర్భాగంలో నడిచే మెట్రో రైలు తూర్పు ఒడ్డున ఆర్మేనియన్ ఘాట్తో కలుపుతుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ చేపట్టడానికి కేఎంఆర్సీ రంగం సిద్దం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయిటే ట్రయల్ రన్ నిర్వహించే తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించాయి. తూర్పు-పశ్చిమ మెట్రో లైన్ కారిడార్ (గ్రీన్ లైన్) ప్రస్తుతం 9.3 కి.మీల మేర సాల్ట్ లేక్ సెక్టార్ ఐదు నుంచి సెల్దా స్టేషన్ వరకు విస్తరించి ఉంది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు నది అంతర్భాగం లో నిర్మించిన మెట్రో రైలు మార్గం ఈ ఏడాది లోగా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు కేఎంఆర్సీ వర్గాలు తెలిపాయి.






