అమెరికాలో 12 సెకన్లలో… రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. కేవలం 12 సెకన్లలో 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ208 కోట్ల) క్రిప్టో కరెన్సీని దొంగిలించారు. ఎట్టకేలకు వారి మోసం బయటపడి ఏడాది తర్వాత పోలీసులకు చిక్కారు. అమెరికాకు చెందిన ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. అధునాతన సాంకేతికతతో నైపుణ్యం ఉన్న వీరు సులభంగా డబ్బులు సంపాదించడం కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్ క్రిప్టో టెక్నాలజీలో పెండింగ్ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్ చేసి వాటిని మార్చారు. కేవలం 12 సెకన్లలోనే 25 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం క్రిప్టోలను వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ట్రేడర్లు తమ ఖాతాల్లోకి క్రిప్టో లావాదేవీలు జమచేస్తున్నా కాకపోవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘరానా మోసం బయటపడింది.







