కంగనా రనౌత్ కు చేదు అనుభవం

బాలీవుడ్ నటి, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కాలిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఢిల్లీకి బయల్దేరిన కంగన విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కంగన ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.