ఎక్కడివాడైతేనేం? మన అందరి గుండెల్లో కొలువైన సూపర్మ్యాన్ హనుమాన్! : చిరంజీవి ట్వీట్
దేవాలయాల్లో కేవలం పూజారులే ప్రశాంతంగా ఒంటరి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక హైదరాబాద్లో విశ్వహిందు పరిశత్ నిర్వహించే హనుమాన్ ర్యాలీని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి తక్కువ మందితో శోభా యాత్ర నిర్వహించారు. అయితే హనుమ భక్తుడైన మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి గురించి ఓ ఆసక్తికర ట్వీట్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ ట్వీట్కి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ ఆంజనేయస్వామికి భక్తులే. రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ లోగోలో కూడా హనుమంతుడు ఉంటాడు. ఇక 2005లో హనుమాన్ అనే యానిమేషన్ చిత్రానికి కూడా చిరు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా గత కొంతకాలంగా హనుమంతుడి జన్మస్థానం ఏది ఆయన ప్రాంతం లో జన్మించాడు అనే చర్చ జరుగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారు హనుమంతుడు తెలుగు నేలకు చెందినవాడేనని ప్రకటించింది. అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థమని తితిదే కమిటీ పురాణం భౌతిక ఆధారాలతో పేర్కొంది. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా నిర్ధారిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయం లో చిరంజీవి తన ట్వీట్లో ప్రస్తావించారు. ‘‘అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమజ్జయంతికి ఓ ప్రత్యేకత ఉంది. హనుమాన్ మనవాడే అని, మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసింది. ఎక్కడివాడు.. ఎప్పటివాడు.. అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్మ్యాన్ హనుమాన్.’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.







