T 20 కొత్త లీగ్ పై షారుఖ్ భారీ పెట్టుబడులు?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఓ వైపు సినిమా ఫ్యాషన్ ని కంటిన్యూ చేస్తూ, మరోవైపు క్రీడా ప్రపంచపు కరెన్సీ పైనా మోజును అంతకంతకు పెంచుకుంటూనే ఉన్నాడు. క్రికెట్ అంటే ఖాన్ కి విపరీతమైన ఆసక్తి, ఇష్టం. అందుకు తగ్గట్టుగానే షారుఖ్ బిజినెస్ డీల్స్ నడుస్తున్నాయి. తాజాగా కింగ్ ఖాన్ మరో ఆసక్తికర టోర్నీకి తెర తీసాడు.DP వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 కోసం షారూఖ్ ఖాన్ తో ZEE జతకట్టిన విషయం తెలిసిందే.
ఈ కలయిక అంతటా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అప్ కమింగ్ లీగ్ T20లో ZEE ఎంటర్ టైన్ మెంట్ ఎంట్రీకి సింబాలిక్ గా క్రికెట్ ఔత్సాహికుడు షారుఖ్ తో ఒక ఫోటోని రిలీజ్ చేసారు. ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తదుపరి DP వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20లో తన వ్యూహాత్మక పెట్టుబడిని మరింత స్ట్రాంగ్ చేయాలని నిర్ణయించింది. దీని కోసం షారూఖ్ ఖాన్ తో ZEE జతకట్టి ముందుకి వెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ - స్పోర్ట్స్ డొమైన్ కలయిక ప్రేక్షకులకు ఉత్కంఠను పెంచుతోంది.
వరల్డ్ వైడ్ గా పాపులరైన సెలెబ్రేటిస్ తో స్క్రీన్ లపై క్రీడలను వీక్షించడానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహం కనబరుస్తున్నారు. వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచడానికి ఆదాయం పెంచేందుకు ఇది సరైన ఊతమిస్తోంది. రీసెంట్ లీగ్ కు టీఆర్పీలు అందుకునేందుకు అవసరమైనపవర్ ఉందని టి20 నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రచార చిత్రంలో DP వరల్డ్ ILT20తో ZEE తీసుకువచ్చే క్రికెట్ ఎగ్జయిట్ చేస్తుందంటూ బాలీవుడ్ కింగ్ ఖాన్ నాటకీయ పోస్టర్ తో వెల్లడించిన తీరు ఆకట్టుకుంది.
ఈ లీగ్ మిగిలిన వివరాల్లోకి వెళితే, DP వరల్డ్ IL T20 ట్రోఫీ బరిలో కొందరు అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ లతో పాటు ఇతర క్రికెటర్లతో ప్రత్యేక టీమ్ లను సిద్ధం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. DP వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 వచ్చే ఏడాది జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకు UAEలో జరుగుతుంది. 190 పైగా దేశాలలో ZEE - ZEE5 నెట్ వర్క్ ల బలమైన కనెక్షన్ తో భారతదేశం సహా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రీమియం క్రికెట్ కంటెంట్ వీక్షించేందుకు ఆసక్తిగానే ఉన్నారు అని సమాచారం.