ASBL NSL Infratech

గుడులు, బడుల కన్నా వైన్‌షాపులే ఎక్కువైపోయాయి.. టీఆర్ఎస్ సర్కారుపై షర్మిల ఫైర్

గుడులు, బడుల కన్నా వైన్‌షాపులే ఎక్కువైపోయాయి.. టీఆర్ఎస్ సర్కారుపై షర్మిల ఫైర్

తెలంగాణ రాష్ట్రాన్ని బార్‌ల రాష్ట్రంగా మార్చారంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న ఆమె.. దీనిలో భాగంగా నెన్నల మండలం ఆవడం గ్రామ ప్రజలతో కలిసి ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఈ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే దిక్కులేదని విమర్శలు గుప్పించారు. మాట్లాడితే పథకాల పేరు చెప్పే కేసీఆర్ సర్కారు.. వాటిలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయడం లేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని ఒక పక్క కథలు చెప్తూనే, మరో పక్క రాష్ట్రాన్ని బార్‌ల తెలంగాణగా మార్చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గుడులు, బడుల కన్నా వైన్‌షాపులు, బెల్ట్ షాపులే ఎక్కువ అయిపోయాయని షర్మిల ఆరోపించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :