లైగర్ రిజల్ట్పై నోరు విప్పిన విజయ్ దేవరకొండ
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపుల తర్వాత లైగర్ మీదే ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ఆ సినిమా కూడా ఘోర పరాజయాన్నే మిగిల్చింది. ఈ సినిమా రిలీజ్కు ముందు విజయ్ లైగర్ ఇండియాను షేక్ చేస్తుందని, లెక్క 200 కోట్ల నుంచి మొదలవుతుందని అబ్బో చాలానే చెప్పాడు. తీరా రిలీజ్ తర్వాత చూస్తే విజయ్ ఎక్కడా సినిమా గురించి నోరు మెదపకపోవడంతో దారుణమైన ట్రోలింగ్కు గురయ్యాడు.
లైగర్ రిలీజ్ తర్వాత సైమా అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్నాడు విజయ్. గత నెల బెంగుళూరులో జరిగిన ఈ ఫంక్షన్లో యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును విజయ్ గెలుచుకున్నాడు. లేటెస్టుగా ఈ ప్రోగ్రామ్ ఓ ఛానెల్లో ప్రసారం కాగా అందులో విజయ్ తన సినిమా పరాజయం చెందడంపై స్పందించాడు.
గొప్ప సినిమాను ఆడియన్స్కు అందించడానికి కష్టపడ్డానని, కానీ అది సరిపోలేదని విజయ్ అన్నాడు. అందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయని, ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయడానికి మరింత కష్టపడతానని విజయ్ పేర్కొన్నాడు. ఈ మాట చెప్పడానికే సైమా ఫంక్షన్కు హాజరయ్యానని లేకపోతే వచ్చే వాడిని కాదని విజయ్ ఈ సందర్భంగా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సమంత హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.