మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ప్రదేశ్ పర్యటించారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. అలాగే పలు గూడ్స్ రైళ్లను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
Tags :