యాపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనం అయ్యాయి. యాపిల్ ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడకు ప్రశ్నార్థకం చేస్తోందని దావాలో ప్రభుత్వం ఆరోపించింది. తద్వారా కృత్రిమంగా ధరలను పెంచుతోందని పేర్కొంది. దీని వల్ల నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతోందని దావాలో పేర్కొంది. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో జస్టిస్ డిపార్ట్మెంట్ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేశాయి. ఇదే తరహా ఆరోపణలను గూగుల్, మెటా, అమెజాన్ ఎదుర్కొంటున్నాయి. యూరప్ లోనూ ఐఫోన్ తయారీ కంపెనీపై దర్యాప్తు జరుగుతోందని తెలిసింది.
Tags :